మన టివి 6 న్యూస్ ((మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం). స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి తెలంగాణ రాష్ట్రంలోని “టి హబ్” (T-Hub), బ్రెజిల్లోని “హబ్ గోయస్” ల మధ్య మన రాష్ట్రం, బ్రెజిల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ (HUB GOIAS) ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి.
మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ (T-Hub), హబ్ గోయస్ (HUB GOIAS) కలిసి పని చేస్తాయి. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.