మన టివి6 న్యూస్ – సత్తుపల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై20 /25). ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టిపై, తుమ్మలపై, పొంగులేటిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండల కేంద్రాల్లో కేటీఆర్ దిష్టి బొమ్మాలను దగ్ధం చేసిన …సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి, కల్లూరు ఎఎంసి చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, అధికార ప్రతినిధులు,సత్తుపల్లి పట్టణ, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి మరియు తల్లాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.