మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 13/06/2025 శుక్రవారం).
చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం
అంగన్వాడీ స్కూళ్లలో అమృతాహారం
ఎండాకాలం సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ స్కూళ్లు షురూ అయ్యాయి.
అమ్మ మాట–అంగన్వాడీ బాటలో భాగంగా ర్యాలీలు తీసి, చిన్నారులకు టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు.

తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం తొలిరోజే చిన్నారులకు ఎగ్ బిర్యానీ వడ్డించింది.
గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కగారి ఆదేశాల మేరకు లంచ్లో ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ’ అందించగా.. చిన్నారులు సంబురంగా తిన్నారు.
ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు ఆనందపడ్డారు.
ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటున్నది.
వారానికి రెండు, మూడు సార్లు ఎగ్ బిర్యానీ
వడ్డించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరమడంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగేలా ప్లాన్ చేసింది.
అలాగే, అంగన్వాడీ చిన్నారులు, సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉత్సాహం పెంచేందుకు అన్ని సెంటర్లలో తొలిసారి బెల్ సిస్టమ్ను తీసుకొచ్చింది.
బడి గంట తరహాలో అంగన్ వాడీ సెంటర్లలోనూ బెల్ను ఏర్పాటు చేశారు.
పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆటవస్తువులను అంగన్ వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నది.
అలాగే, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ఇప్పటికే ప్రకటించారు.
అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సర్కారు.. వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడి కేంద్రాలకు బెంచీలను సరఫరా చేయాలని నిర్ణయించింది.
అంగన్ వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ దీటుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే గౌరవ సీఎం రేవంత్గారు ఆదేశాలిచ్చారు.
మొత్తంగా అంగన్వాడీ కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపునకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు విప్లవాత్మక అడుగులు వేస్తున్నది.
