మన టివి6 న్యూస్ పెనుబల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 14/06/2025 శనివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో 13వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి లంకపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి రామాలయంలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న సత్తుపల్లి ఫైర్ సిబ్బంది, వి ఎం బంజర్ పోలీసులు, సత్తుపల్లి108 సిబ్బంది పైలెట్ రాధాకృష్ణ టెక్నీషియన్ అప్పారావు. పెనుబల్లి 108 సిబ్బంది పైలెట్ వేణు టెక్నీషియన్ రామకృష్ణ, తక్షణమే స్పందించి హుటా హుటీన స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను రక్షించి పెనుబల్లి, సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
ప్రమాద సమయంలో రామాలయంలో నిద్రిస్తున్న దివ్యాంగుడు, లారీ డ్రైవర్, క్లీనర్లు కు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదంలో చిన్న గాయాలతో వీరు ముగ్గురు బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రామాలయం గుడి మీదుగా దూసుకొని పోయిన లారీ ఘటనలో లంకపల్లి గ్రామం వ్యక్తి గుడిలో నిద్రిస్తుండగా వ్యక్తి కి ఎటువంటి ప్రమాదం జరగలేదు చిన్న గాయాలు అలాగే లారీలో ఇరుకొని పోయిన డ్రైవర్, శ్యామ్ సింగ్, క్లీనర్ ఇద్దరికీ చిన్న గాయాలు వీరిని పెనుబల్లి 108 సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫైర్, సిబ్బంది కొక్లిర్ సహాయం తో సురక్షితం బైటికి తీసి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి 108లో తరలించడం జరిగింది.