google-site-verification: google78487d974c7b676c.html
Daily News

వెంకటరత్నం, శేషమ్మ పార్థివ దేహాలకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

26.5KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం పంచాయతీలోని శ్రీ సిటీ చైర్మన్ గరికపాటి వెంకట్రావు, వి ఏ డెవలపర్స్ అధినేత గరికపాటి ఆంజనేయ ప్రసాద్ మాతృమూర్తి గరికపాటి వెంకటరత్నం పోలేపల్లి  లో శనివారం మృతి చెందగా. వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన మెడకంటి శేషమ్మ మృతి చెందారు. వీరిద్దరి భౌతిక కాయానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి మరణానిక గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్ది మల్లారెడ్డి, భూక్య సురేష్ నాయక్, మండల నాయకులు కళ్లెం శేశిరెడ్డి , కొక్కు రాజు ,షాబాదు కర్ణాకర్ రెడ్డి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!