google-site-verification: google78487d974c7b676c.html
Telangana

ఫార్ములా – ఇ రేస్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కెటిఆర్.

64.9KViews
  • భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను.
  • రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయి.. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పిన. మీరు ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సమాధానం చెబుతాను. పూర్తిగా విచారణకు సహకరిస్తానన్నాను.
  • ఈ విచారణకు 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? ఆ పైసలతోని రైతు రుణమాఫీ చేయొచ్చు.. ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు.
  • అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను…. హైకోర్టు న్యాయమూర్తి కాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబెట్ కు పోదాం.
  • రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో అయినా ఇడి ఆఫీస్ లో అయినా, న్యాయమూర్తి ముందు అయినా లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. దొంగెవరో.. దొరెవరో.. ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది.
  • రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. ఫార్ములా ఈ కార్ రేసు, ఓటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్ ను, నన్ను ప్రశ్నలు అడగండి. నేను సమాధానం చెప్తాను. ఆయన కూడా జవాబు చెప్పాలి. తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి. ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుంది.
  • ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిండు కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఇడి కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు.
  • అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం, నిజాయితీనే గెలుస్తుంది. హైకోర్టు. సుప్రీంకోర్టు. భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది.
  • ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు.
  • 8 గంటలు వాళ్ళ ఇదే అడిగారు నేను ఇదే చెప్పాను. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం….
  • పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది. ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను నేనే అడిగాను. ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను.
Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!