♦️రైతురాజులకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
♦️రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.
♦️రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం.
♦️కెసిఆర్ ప్రభుత్వం వదిలేసిన సీతారామ ప్రాజెక్టును మేము పూర్తి చేశాం.
♦️ సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం.
మన టివి6 న్యూస్-కూసుమంచి, (మన ప్రాంత వార్తలు మనకోసం 15/06/2015 ఆదివారం). ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం రైతన్నలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక సాగు కార్యక్రమంలో పాల్గొని అరక పట్టి దుక్కిదున్ని, రైతులతో కలిసి విత్తనాలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాటల్లోనే ప్రధానాంశాలు
🌾ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతు ను రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది.
🌾రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రోత్సాహిస్తోంది.
🌾ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే,మన ప్రభుత్వం 18 నెలల్లో నే రూ 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది.
🌾రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ది తో పని చేస్తోంది.
🌾నాణ్యమైన విత్తనాలకు, ఎరువులకు ఇబ్బంది లేకుండా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసాం.
🌾 గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తున్నాం.
🌾వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12 వేలు ఇస్తున్నాం.
🌾రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాం, రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం.
🌾కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మనం మొదటి స్థానంలో ఉన్నాం.
🌾ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది.
