మన టివి6 న్యూస్-సత్తుపల్లి (మన ప్రాంత వార్తలు మనకోసం 14-06-2025 శనివారం).
సత్తుపల్లి ప్రభుత్వ జెవిఆర్ డిగ్రీ కాలేజీ లో నూతన షెడ్ లు నిర్మాణం, కాలేజీ భవన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
జెవిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ తో, ప్రభుత్వ అధికారులుతో కలిసి సమీక్షించ నిర్వహించారు.
డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంను పరిశీలించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో క్రీడాకారులు నుండి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. జెవిఆర్ డిగ్రీ కాలేజీ లో క్రీడాకారులకు ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ ఏర్పాటు చేస్తామని డాక్టర్ మట్టా దయానంద్ తెలియజేశారు.
అంతే కాకుండా ఈ జెవిఆర్ కాలేజీ ప్రాంగణంలో లో ఉదయం, సాయంత్రం పూట ఎంతో మంది వాకింగ్ కు వస్తుంటారు అని వారి కోసం కూడా ఆహ్లాదకరమైన, వాతావరణం ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
