మన టీవీ 6 న్యూస్- ఖమ్మం (మనప్రాంత వార్తలు మనకోసం 14/6/2025 శనివారం). ఖమ్మం లోని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం లో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల ముఖ్య నాయకుల సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి, నియోజక ఇంచార్జి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎదులాపురం మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎలా ముందుకు వెళ్ళాలి, జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలు కుతంత్రాలను తిప్పి కొట్టాలని, వారు కాంగ్రెస్ పార్టీపై చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ…జిల్లాలో నామినేటెడ్ పదవులు విషయంలో నాయకులు మధ్య ఏమైనా విభేదాలుంటే వారిని కూర్చోబెట్టి అవగాహన కల్పించాల్సిలని, సంక్షేమ ఫలాలు విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని, దీనిపై ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
నియోజక ఇంచార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల మధ్య ఐక్యతను పెంచి సామూహికంగా, కలిసికట్టుగా, స్థానిక ఎన్నికల్లో పనిచేసే విధంగా కార్యకర్తలను సిద్ధం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, రషీద్, తమ్మినేని.నవీన్, గోనె భుజంగ రెడ్డి, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
