google-site-verification: google78487d974c7b676c.html
Devotional

ముక్కోటి పండుగను పురస్కరించుకొని భద్రాచలం పాదయాత్ర…..

68.7KViews


ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సత్యలపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీరామ భక్తులు గత 20 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామచంద్ర స్వామి వారి పల్లకిని మోసుకుంటూ భద్రాచలం వెళ్లి ఆ రఘు రామున్ని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా
ఈనెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని సుమారు 400 మంది శ్రీరామ భక్తులు సత్యాలు పాడు గ్రామం నుండి  5వ తేదీ సాయంత్రం మూడు గంటలకు పాదయాత్ర భద్రాచలం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగంగా 6వ తేదీ సాయంత్రం వి ఎం బంజర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు వీరికి అల్పాహారాన్ని అందించారు.
వీరితో కలిసి శ్రీరామ పల్లకిని మోచారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!