మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 11/25). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో కొలువై ఉన్నటువంటి శ్రీ రాజ సాయి బాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాజ సాయి బాబా మందిరాన్ని పూలతో అలంకరించారు.
తెల్లవారుజాము నుండే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయి పారాయణం ఆలపించారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్