మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/04/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం విఎం బంజర పోలీసులు సుమారు 1 కేజీ 110 గ్రాములు గంజాయిని నమ్మదగ్గ సమాచారం మేరకు విఎం బంజర పోలీసులు వి.ఎం బంజర్ బస్టాండ్ బోయిన వెంకటరమణ అనే వ్యక్తిని పట్టుకున్నారు.
పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకటరమణకు వైద్యపరరీక్షలు నిర్వహించి 12వ తేదీ శనివారం రిమాండ్ కు తరలించారు. వెంకటరమణపై ఇప్పటికే 6 కేసులో ఉన్నాయని ఈసారి కేసులో అతనికి బెయిల్ రాదని విఎం బంజర ఎస్ఐ వెంకటేష్ తెలియజేశారు.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్