మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం)ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) వి.ఎం బంజర్ ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం స్కూలు వదిలిన తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి యూటర్న్ లో సైకిల్ పై రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొనడంతో వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వంశీని తక్షణమే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనబలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
Mana Tv 6 News > Crime News > రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు.

Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్
the authorManatv6News_J SRINIVAS REPORTER
All posts byManatv6News_J SRINIVAS REPORTER
You Might Also Like
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు..
April 21, 2025
రీల్స్ చేస్తూ నీటిలో మునిగిపోయిన మహిళ.
April 17, 2025
పెనుబల్లి మండలంలో చైన్ స్నాచింగ్.
April 17, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.
April 13, 2025