google-site-verification: google78487d974c7b676c.html
Crime News

రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు.

49.8KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం)ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) వి.ఎం బంజర్ ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం స్కూలు వదిలిన తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి యూటర్న్ లో సైకిల్ పై రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొనడంతో వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వంశీని తక్షణమే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనబలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!