మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 21/04/2025 సోమవారం.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను విఎం బంజర పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారని కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కు చెందిన మక్కెళ్ళ నాగరాజు (26), ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన చల్లా శివప్రసాద్ లు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 18 ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నట్టు ఎసిపి రఘు తెలిపారు.నిందితుల దగ్గర నుండి వాహనాలను కొనుగోలు చేసిన మరో 8 మందిని కూడ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసామని, పట్టుబడిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 18 ద్విచక్ర వాహనాల విలువ సుమారు 12,45000/- రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో ఏసిపి రఘు తెలిపారు.
ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఎం ముత్తు లింగయ్య, ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్స్ ను ఎసిపి రఘు అభినందించారు.