google-site-verification: google78487d974c7b676c.html
Local News

తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై అధికారులు దృష్టి పెట్టాలి… మాజీ ఎంపీటీసీ వంగ ఝాన్సీ నిరంజన్ గౌడ్…

32.6KViews

మన టివి 6న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 30/01/2025 గురువారం) 29వ తేదీ బుధవారం కొన్ని వార్త పత్రికలలో వచ్చినటువంటి “పెనిమిటి పెత్తనం” అనే వార్తా కథనంపై స్పందించిన వియ బంజర్ మాజీ ఎంపీటీసీ వంగ ఝాన్సీ నిరంజన్ దంపతులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. మంచి వార్తలు రాసి సమాజ శ్రేయస్సుకు పాటుపడాల్సినటువంటి కొన్ని పత్రికలు, సమాజం లో సమస్యలను సృష్టించే వార్త కథనాలను, కొందరి నాయకులను టార్గెట్ చేసి వ్రాయటం అనేది తప్పుడు పద్ధతిగా వారు పేర్కొన్నారు.

ఇటువంటి తప్పుడు వార్తా కథనాల వల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లి అవకాశం ఉందని సంబంధిత అధికారులు కూడా ఇటువంటి వార్తా కథనాలు రాసే వారిపై దృష్టి పెట్టాలని వంగా ఝాన్సీ నిరంజన్ దంపతులు అధికారులను కోరారు.

Manatv6News_J SRINIVAS REPORTER

1 Comment

  • Undeniably believe that which you said. Your favourite reason seemed to be at the internet the simplest factor to take note of.
    I say to you, I certainly get irked while other folks consider worries
    that they plainly do not know about. You managed to hit
    the nail upon the top and outlined out the whole thing without
    having side effect , other folks could take a signal. Will
    probably be again to get more. Thank you

Leave a Reply

error: Content is protected !!