మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 30/01/2025 గురువారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం. 29వ తేదీ బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతుల పై కొన్ని వార్త పత్రికలలో వచ్చిన తప్పుడు ప్రచురణలపై సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.
తప్పుడు ప్రచురణలను ఖండించిన వారిలో మట్టా యువసేన నాయకులు, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, మట్టా దయానంద్ విజయకుమార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉన్నారు. వీరు తప్పుడు ప్రచురణ చేసిన పత్రికపై ధ్వజమెత్తారు. పత్రికలకు స్వేచ్ఛ ఉంది కదా అని కొన్ని పత్రికలు ఇస్తానుసారంగా ప్రచురణాలు చేయటం సరైన పద్ధతి కాదని, తప్పుడు రాతలు రాసే ఆ పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిరంతరం ప్రజాసేవలో. ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్. అటువంటి మంచి వ్యక్తిపై కొందరు రాసే తప్పుడు కథనాలతో ప్రజలలో డాక్టర్ దయానంద్ పై ఉన్న ప్రేమ, నమ్మకం, పేద ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయతలను ఎవరు తగ్గించలేరు. కొన్ని పార్టీ నాయకుల అండదండలతో వారి కనుసన్నల్లో పనిచేసినటువంటి వార్తా పేపర్ లు ఏవైతే ఉన్నాయో వాళ్లను మళ్లీ ఒకసారి హెచ్చరిస్తున్నాం అన్నారు.
డాక్టర్ మట్టా దయానంద్ కుటుంబం ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు అంకితమైన కుటుంబం అని వారి తల్లిదండ్రులు, భార్య నిరంతరం ప్రజాసేవ కొరకు పనిచేస్తూ ఉంటారని, అలాంటి మంచి కుటుంబం పై తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాస్తే సహించబోమని, వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
