మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 26/01/2025 ఆదివారం).
దశాబ్ద కాలం అధికారంలో ఉండి ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఇవాళ గ్రామ సభలలో ప్రజలను రెచ్చగొడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారు చేసే తప్పుడు ప్రచారాలు వెంటనే మానుకోవాలని లేదంటే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ అన్నారు.
🔻ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
🔻 ప్రజలంతా సంయమనం పాటించాలి.
ప్రజలు గ్రామ సభలలో అధికారులు చెప్పే విషయాలను పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలి.
🔻అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలతో ప్రజల కలను ప్రజా ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుంది.
🔻కొంత మంది బిఆర్ఎస్ నాయకులు గ్రామసభలలో ప్రజలను రెచ్చగొట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి నియోజకవర్గలలో ఏ ఒక్కరికి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటి మీరు అధికారం కోల్పోయాక ప్రజల కష్టాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసము అనేది ప్రజలు గుర్తుచేసుకోవాలి. అమాయక ప్రజలను రెచ్చగొట్టి గ్రామ సభలలో వచ్చే అధికారులను ఇబ్బంది పెట్టి పేద కుటుంబాలకు అన్యాయం చేసే దిశగా ఈ రోజు బిఆర్ఎస్ చేస్తుంది. దయచేసి అన్ని గ్రామాల ప్రజలు గమనించి మీరు ఏ ఏ పథకాలకు అర్హులైనవారో ఆ పథకాలు పొందగలరు. గ్రామ సభలో ఎన్ని ఎజెండాలు ఉన్నాయో అధికారులు క్లుప్తంగా మీకు వివరిస్తారు. మీకున్న సందేహాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోగలరు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తుండడంతో
బి ఆర్ ఎస్ నేతలకు కడుపు మంటగా ఉంటుందని అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారని సురేష్ నాయక్ తప్పుడు ప్రచారం చేసే బి ఆర్ ఎస్ నాయకులు పై ధ్వజమెత్తారు.
