మన టీవీ 6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం07/06/2025 శనివారం).
ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రజా సేవలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని జూనియర్ లాయర్లు, న్యాయవాదుల కోసం యూనిఫాం క్లాత్ ను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు.
ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్ క్లాత్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో న్యాయవాద సొసైటీ సభ్యులు కె.రాజశేఖర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర ప్రాంతాల లాయర్లు, జూనియర్లకు ఒక్కొక్కరికీ రెండు జతలు చొప్పున అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని
లాయర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
