google-site-verification: google78487d974c7b676c.html
Daily News

అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది……మంత్రి పొంగలేటి.

48.5KViews

మన టివి6 న్యూస్ – కూసుమంచి మండల (లోకల్ న్యూస్ జులై 04/25). మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం-లలితల కుమార్తె సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గురువారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన పరుశరామ్ కుటుంబాన్ని మంత్రి పొంగులేటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పరశురాం కుమార్తె సింధు, తల్లి లలిత మంత్రి ముందు లలిత కన్నీటి పర్యాంతమై తమ బాధను చెప్పుకున్నారు. వారి బాధను, నిస్సాయస్థితిని చూసిన మంత్రి పొంగులేటి స్పందించి ఎంపీ రఘురాం రెడ్డి, తాను కలిసి స్వయంగా హైదరాబాద్ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ల తో మాట్లాడి వైద్యం చేపిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎం రిలీఫ్ పండ్ బిల్లులన్ని మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. అధైర్య పడకు అక్కా నీ బిడ్డకు నేను అండగా ఉంటానని సింధు తల్లి లలితకు హామీ ఇచ్చారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!