google-site-verification: google78487d974c7b676c.html
Local News

సత్తుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర.

7.45KViews

మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 08/06/2025 ఆదివారం). సత్తుపల్లి పట్టణంకేంద్రంలోని 22 వ వార్డు నేతాజీ రోడ్ లో ఆదివారం ఉదయం” జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ ” కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేసిన మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.

ఈకార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు పథకం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగించుకోవాలని, గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, కమల్ పాషా, చల్లగుళ్ల కృష్ణ రావు మరియు సత్తుపల్లి పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!