google-site-verification: google78487d974c7b676c.html
Local News

మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీ….మాజీ ఎమ్మెల్యే సండ్ర

67.4KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సండ్ర వెకట వీరయ్య మాటల్లోని ప్రధానాంశాలు…..

  • ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ దొంగాట.
  • ఖమ్మం జిల్లా లోని రెండు అసెంబ్లీ స్థానాలలో మాలలకే కేటాయించిన కాంగ్రెస్
  • అసెంబ్లీ స్పీకర్, కీలకమైన డిప్యూటీ సీఎం పదవులు సైతం మాలలకేనా ..? కాంగ్రెస్ కు సండ్ర ప్రశ్న.
  • ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేసి మాదిగ సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ.
  • మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నదని సండ్ర ధ్వజమెత్తారూ.
  • ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడం లేదని సండ్ర మండిపడ్డారు.
  • ఎస్సీ వర్గీకరణ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ అమలు చేయడం లేదని విమర్శించారు.
  • సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
  • కానీ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదన్నారు.
  • వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.
  • కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకమని భావించాల్సి వస్తుందని సండ్ర ఆరోపించారు.
  • కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీగా భావించాల్సి వస్తుందని అన్నారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు పదవులు ఇవ్వడం లేదనీ, రాష్ట్రంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవితో పాటు అసెంబ్లీ స్పీకర్ ఖమ్మం జిల్లాలోని రెండు ఎమ్మెల్యే స్థానాలను సైతం మాదిగలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు.
  • కెసిఆర్ ప్రభుత్వంలో ఎస్సీ వర్గాల వారి ఉన్నతి కోసం దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, 1025 గురుకులాలు, రెసిడెన్షియల్లు ఏర్పాటు చేశార.
  • కెసిఆర్ దళితులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దళిత బంధు ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చారు.
  • కాంగ్రెస్ పాలన రాగానే దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
  • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ధరించి ఉంచినది కాంగ్రెస్ ప్రభుత్వం.
  • రాష్ట్ర సచివాలయానికే అంబేద్కర్ పేరును పెట్టి దళితుల పట్ల ఉన్న కెసిఆర్ చిత్తశుద్ధిని ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలు మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ మాదిగ జాతికి అండగా వుంటుందని హెచ్చరించారు.
  • ఎస్సీ వర్గీకరణ ను తక్షణమే అమలు చేసి ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో తమాషా పద్ధతిలో అమలు చేయాలని సండ్ర డిమాండ్ చేశారు.
Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!