google-site-verification: google78487d974c7b676c.html
Daily News

ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టండి… బిసి శ్రీనివాస్

63.6KViews

మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి శనివారం ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి పత్రన్ని అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియా తో మాట్లాడాతూ ఖమ్మం ప్టణంలో విద్యవ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని, పీజుల నియంత్రణ లేకుండా పోయిందని ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని అయన అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించక పొగ ఒక్క క్యాంపస్ కి పర్మిషన్ తీసుకొని 4నుంచి 5 క్యాంపస్ లు నడుపుతున్న అధికారులు పటించుపోవటం బాధాకరం అని శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా ప్రెవేట్ పాఠశాలలు నర్సరీ విద్యార్థికి 70నుంచి 80 వేలు పీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్ అని, డ్రెస్స్ లు అని, అధిక మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనలు అన్నీ పాటిస్తున్నారా అంటే అది లేదు. ఫైర్ సిబ్బందికి అనుకూలంగా లేని ఇరుకు అయిన బిల్డింగ్ లను అద్దె కి తీసుకొని పిల్లలను హింసకు గురి చేస్తున్నారని అన్నారు.

ఫిటినెస్ లేని బస్సులు, అర్హత లేని ఉపాధ్యాయులు అస్తవ్యస్తమైన హాస్టల్ సౌకర్యలతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, వారి తల్లి తండ్రులు అనేక మంది మాకు పిర్యాదు చేశారని శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇదే విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు పోయామని అధికారులకు కొంత సమయాన్ని ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో దిగుతాం అనీ శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యాక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయిన నాగయ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి మోడేపల్లి వెంకటాచారి, మండల నాయకులు ఎనుముల రాము యాదవ్, బయ్యారపు నరేంద్ర, లాయర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!