google-site-verification: google78487d974c7b676c.html
Daily NewsLocal News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ ముట్టా దయానంద్.

259Views

మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కర్రలపాడు గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలంతా స్థానిక ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజా ప్రభాకర్ చౌదరి , సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, ఎఒ ప్రసాద్ రావు, ఎఇఒ మండలం కాంగ్రెస్ పార్టీ నాయుకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!