జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్హౌస్ బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ , హర్కర వేణుగోపాల రావు , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ప్రముఖులు మహాత్ముడికి నివాళులు అర్పించారు.

Source:mana tv6 news