google-site-verification: google78487d974c7b676c.html
Andhra Pradesh

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

32.5KViews

మన టివి6 న్యూస్ – ఆంధ్ర ప్రదేశ్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/06/2015 శుక్రవారం). ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలను నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.

డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ప్రధానాంశాలు…..

• వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.

• నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న శ్రీ అంకారావు జీవితం స్ఫూర్తిదాయకం.

• అడవులను పెంచడమే కాదు… కార్చిచ్చుల నివారణకు అవగాహన సదస్సులు.

• పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

• మొక్కల నాటడం, వాటిని పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, అమరావతి డవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అనంతరాము, పీసీసీఎఫ్ శ్రీ ఎ.కె.నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!